రాజానగరం మండల కమిటీ సమీక్షా సమావేశం

రాజానగరం నియోజకవర్గం, ఒక రాజకీయ పార్టీకి వెన్ను దన్ను అయ్యిన మండల కమిటీ నిర్మాణంలో భాగంగా రాజానగరం మండల కమిటీ సమీక్షా సమావేశం రాజానగరం మండల జనసేన పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ మరియు రాజానగరం మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.