శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి గ్రామంలో ద్వారకా నగర్ (గొల్లల గ్రూప్) నందు వేంచేసియున్న శ్రీ కృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా స్వామి వారి అన్న సమారాధన కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పణికుమార్, గుబ్బల చంద్రరావు, మన్నే శ్రీనివాస్, కానుబోయిన నాగరాజు, దొమ్మేటి సత్యనారాయణ, శ్రీ కృష్ణ యాదవ్ యూత్, తదితరులు పాల్గొన్నారు.