శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యంగా రాష్ట్రపతి భవన్‌కు తిరిగి వచ్చాను: రామ్ నాథ్ కోవింద్

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బైపాస్ సర్జరీ చేయించుకుని రాష్ట్రపతి భవన్‌కు తిరిగొచ్చారు. కోవింద్‌కు న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.

“శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యంగా రాష్ట్రపతి భవన్‌కు తిరిగి వచ్చాను. మీ అందరి అభిమానం, ప్రార్థనలతో తిరిగి ఆరోగ్యంగా తయారయ్యాను. ఎయిమ్స్, ఆర్మీ ఆర్ఆర్ ఆసుపత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అసాధారణమైన సంరక్షణ కారణంగా వేగంగా కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు. ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది “అని కోవింద్ ట్వీట్ చేశారు. 75 ఏండ్ల వయసున్న రామ్‌నాథ్‌ కోవింద్ మార్చి 30 న న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో కార్డియాక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.