జాతీయ కబడ్డీ జట్టుకు ఎన్నికైన యశ్వంత్ ను అభినందించిన రామ శ్రీనివాస్

రాజంపేట: జాతీయ కబడ్డీ జట్టుకు ఎన్నికైన రాజంపేట పట్టణ పరిధిలో సరస్వతీపురానికి చెందిన విద్యార్థి అబ్బిగారి యశ్వంత్ కు జనసేన పార్టీ నాయకులు సోమవారం రామ శ్రీనివాస్ స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. 9వ తరగతి చదువుతున్న యువకుడు అబ్బిగారి యశ్వంత్ జులై 25,26 తేదీలలో హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబ్బడ్డి పోటీలలో పాల్గొని కె.వి.యస్ జాతీయ స్థాయి కబ్బడి పోటీలో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ యశ్వంత్ లాంటి యువకుడుని విద్యార్థులు, విద్యార్థినిలు అందరూ ఆదర్శంగా తీసుకుని చదువుల్లోను మరియు క్రీడల్లోను రాష్ట్ర మరియు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్సాహంగా పోటీతత్వంతో ఉన్నతస్థాయి లక్ష్యాలను సాధించడానికి ఉత్సాహవంతులుగా ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు రాణించాలని తమ తమ విధులలో సమయస్ఫూర్తిని సద్వినియోగం చేసుకోవాలని అబ్బిగారి యశ్వంత్ లాంటి కుర్రాడిని స్పూర్థిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ యువనాయకుడు అబ్బిగారి గోపాల్, బి భార్గవ్, రవి, మురళి మోహన్, శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు.