డాక్టరేట్ సాధించిన రవికుమార్ మిడతానకు అభినందన సత్కారం

విజయనగరం: పేద విద్యార్థులు అభ్యున్నతి కోసం స్థాపించిన రవి ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు సోషల్ యాక్టివిస్ట్ రవి కుమార్ మిడతాన కు సోషల్ సర్వీస్ విభాగంలో తమిళనాడులోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతానను అభినందిస్తూ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనాసేన సీనియర్ నాయకులు మర్రాపు సురేష్, పిట్ట బాలు, చిన్ని, కోటి, రాంబాబు, జాన్ని, ప్రశాంత్, పండు, మహేష్ పాల్గొన్నారు.