రాయచోటి డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ… రాయచోటి నుంచి సుండుపల్లి మీదుగా రాయవరం, పించ, సానిపాయి, రాజంపేట, తదితర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు అసౌకర్యంగా ఉన్న ఆర్టిసి బస్ సర్వీసులు ప్రయాణికులకు అనుకూలమైన సమయాల్లో మరియు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, పాలకులు, సంబంధిత శాఖ అధికారులు,త క్షణమే యుద్ధప్రాతిపదికన స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా స్కూల్, కాలేజి వెళ్ళే విద్యార్థినీ విద్యార్థులకు సౌకర్యార్థంగా, బస్ స్టాప్ లు ఉండాలి, అలానే సుండుపల్లి మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాన్ని గుర్తించి వందల వేల మంది ప్రజలు రాజంపేట, పీలేరు, తిరుపతి అలా దూరప్రయాణాలు చేసే ప్రయాణికులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని బస్ షెల్టర్ వద్ద మహిళలను, వృద్ధులను, విద్యార్థిని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడి సంబంధిత శాఖ అధికారులు మరుగుదొడ్లు వెంటనే ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ రియాజ్ పాల్గొన్నారు.