జగిలి ప్రభాకర్ భౌతికకాయానికి నివాళులర్పించిన రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, టి.సుండుపల్లి మండలం, ఎగువ ఈడిగపల్లె నివాసి జగిలి ప్రభాకర్ (46) భారతదేశ రక్షణ వ్యవస్థ సి.ఆర్.పి.ఎఫ్ లో పని చేస్తూ 8నెలలుగా అనారోగ్యంతో ఆర్మీ వైద్యశాలతో పాటు చెన్నైలోని కావేరి వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జగిలి ప్రభాకర్ మృతదేహాన్ని చెన్నై లోని సి.ఆర్.పి.ఎఫ్ అధికార, సిబ్బంది బృందం ఎగువ ఈడిగపల్లెకు ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చి.. ఆర్మీ, పోలీస్ అధికార లాంచనాలతో అంత్యక్రియలు చేపట్టగా.. స్థానికులు, గ్రామ ప్రజలు మరియు మిత్రులతో కలిసి జనసేన పార్టీ తరపున రామ శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు.