తెలంగాణ వీర మహిళలకు శిక్షణా తరగతులు

హైదరాబాద్ కేంద్ర కార్యాలయం నందు, జనసేన తెలంగాణ క్యాడర్ డెవలప్మెంట్ లో భాగంగా వీర మహిళలకు ఆదివారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి సంబంధించి శ్రీమతి జయ కళ్యాణి చే నిర్వహించబడిన తదుపరి సెషన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన బొలిశెట్టి సత్యనారాయణ, పాల్గొన్న పోలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్. “భారతదేశంలో మహిళల పాత్ర/మహిళా నాయకత్వం” అనే అంశంపై ప్రముఖ పర్యావరణవేత్త, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ చే శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయుట జరిగినది. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వీర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీమతి రత్న, ఆర్గనైజింగ్ సెక్రటరీలు శ్రీమతి భాగ్యలక్ష్మి, కుమారి లిఖిత, జాయింట్ సెక్రెటరీ శ్రీమతి సునీత ప్రసాద్, సెక్రెటరీ శ్రీమతి దాక్షాయణి, కార్యనిర్వాహక సభ్యులు శ్రీమతి పద్మజ, శ్రీమతి వెంకటలక్ష్మి, శ్రీమతి అరుణ, శ్రీమతి శ్రావణి, శ్రీమతి ప్రభావతి, శ్రీమతి సుజాత, శ్రీమతి ముంతాజ్, శ్రీమతి అనూష, వీరమహిళలు శ్రీమతి సుభాషిణి, శ్రీమతి జ్యోతి, శ్రీమతి శ్రీదేవి, శ్రీమతి నాగలక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది.