పూలే 192వ జయంతోత్సవాలలో పాల్గొన్న రామ శ్రీనివాస్

రాజంపేట: అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లిలో స్త్రీ జాతి విముక్తి ప్రధాత, మన భారత దేశపు మొదటి పంతులమ్మ! సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకల్లో భాగంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, మహిళలు విద్యార్థినిలతో కేక్ కట్ చేయించి, అందరికీ పంచి పెడుతూ మండల కేంద్రంలోని సుండుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని అభివృద్ధి, విద్య, వైద్య, ఉపాధ్యాయ, వివిధ రకాల రంగాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాల నాయకులు, అలానే మండల వ్యాప్తంగా ప్రముఖులతో భారీ ఎత్తున మహిళలు, కాలేజీ విద్యార్థినిలు మరియు స్కూల్ పిల్లలు కలిసి ఘనంగా ఆమె జయంతోత్సవాలను జరుపుకున్నారు. అనంతరం జనసేన పార్టీ తరపున రామ శ్రీనివాస్ మాట్లాడుతూ మన భారత దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తెరిగి స్ఫూర్తితో కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఆదర్శంగా తీసుకుని వివిధ మాధ్యమాల్లో అందరూ కలిసి కట్టుగా సన్నద్దమై భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.