జి.మాడుగుల జనసేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు

పాడేరు: జి.మాడుగుల మండల జనసేన పార్టీ కార్యాలయంలో అరకు పార్లమెంట్ ఇంచార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు, జి.మాడుగుల మండల అధ్యక్షుడు మసాడి భీమన్న అధ్యక్షతన సావిత్రిబాయి పూలె 192వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా రైతు నేస్తం ఫౌండేషన్ సీఈఓ దాలి లక్ష్మణ్ మరియు సాగెని కోటిబాబు ముఖ్య అతిధులుగా పాల్గొని సావిత్రిబాయి గారికి పూలమాల వేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మురళి, ఉపాధ్యక్షులు సాగిన ఈశ్వరరావు యూత్ అధ్యక్షులు ఎస్.కె మస్తాన్ అలాగే ట్రెజరీ మరియు జిల్లా కమిటీ మెంబర్ తాంగుల రమేష్, ఖుషి, కొదమ కొండబాబు, కొర్ర భాను ప్రసాద్, మసాడి సింహాచలం యూత్ ఉపాధ్యక్షులు పవన్ కళ్యాణ్, తల్లే త్రిమూర్తులు, కృష్ణా మూర్తి, నాయకులు కార్యకర్తలు పాలుకోవడం జరిగింది.