రాజంపేట యువతకు అండగా నిలచిన రామ శ్రీనివాస్

రాజంపేటకు చెందిన యువకులు కొంతమంది కొత్త జిల్లాల ఏర్పాటుతో లక్షల రూపాయలు అప్పులు చేసి బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళాలని నిశ్చయించుకోగా ఆ సమయంలో వారికి పి.సి.సి.లు రాక వీసాల టైం అయిపోయి ఇబ్బంది పడడం జరిగింది. విషయం తెలుసుకున్న అన్నమయ్య జిల్లా జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రామ శ్రీనివాస్ బాధితులతో కలసి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశంకు వినతి పత్రం అందించి, కొత్త జిల్లాల ఏర్పాటుతో గల్ఫ్ వెళుతున్న యువకులకు పి.సి.సి.లు రాక ఇబ్బందులు పడుతున్నారు.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడంతో వెంటనే స్పందించిన కలెక్టర్ గిరీశం జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజుతో మాట్లాడి సమస్య పరిష్కరించారు.