డాక్టరేట్ సాధించిన రవికుమార్ మిడతాన

విజయనగరం: పేద విద్యార్థులు అభ్యున్నతి కోసం స్థాపించిన రవి ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు సోషల్ యాక్టివిస్ట్ రవి కుమార్ మిడతాన కు సోషల్ సర్వీస్ విభాగంలో తమిళనాడులోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రకటించదం జరిగింది. తమిళనాడు రాష్ట్ర చెన్నైలో హానర్బుల్ జడ్జ్ కే.వెంకటేశన్, వైస్ ఛాన్స్లర్ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ & తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ & ఫార్మర్ స్పెషల్ కమిషనర్ కె సంపత్ కుమార్ ఐఏఎస్ వారిచే డాక్టరేట్ అవార్డును నవంబర్ 26వ తేదీన రాజా అన్నామలై మందిరంలో అందుకోవడం జరగుతుంది. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ.. డాక్టరేట్ పొందడం చాలా గర్వంగా ఉందని.. చాలా బాధ్యతగా భావిస్తున్నానని, డాక్టరేట్ పొందడంతో బాధ్యత మరికొంత పెరిగిందని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.