తొలగించిన పెన్షన్ల పై తహశీల్దార్ కి వినతి పత్రం అందజేసిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల అధికారులు వారికి వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు రద్దు చేసిన విషయం పట్ల భాదితులతో కలిసి వినతిపత్రాలు అందజేస్తున్న జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏదో చిన్న చిన్న కారణాలు చూపి నోటీసులు జారీ చేసి తొలగించిన పెన్షన్లు తిరిగి పునరుద్దించాలని కోరుతూ గౌరవనియులైన టి. సుండుపల్లి మండల అభివృద్ధి అధికారి మరియు, తహశీల్దార్ కి రామ శ్రీనివాస్ వినతి పత్రం అందజేయడం జరిగింది. సుండుపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇటీవల ప్రభుత్వం వారు అన్ని రకాల పెన్షన్లు సుమారు 200 వరకు ఏదో కారణం చేత నోటీస్ ద్వారా తొలగించడం జరిగింది. సదరు తొలగించిన పెన్షన్ల పై గ్రామాల్లోని పల్లెలు వారీగా పెన్షన్లు దారుల వద్దకు వెళ్ళి విచారించగా భూమి లేని వారికి, ఇళ్ళు లేని వారికి, 4 చక్రాలు వాహనాలు లేని వారికి, ఆదాయపన్ను లేని వారికి, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా చాలా రకాలుగా పెన్షన్ మీద ఆధారపడి వారి జీవనాదారం కొనసాగిస్తున్న వారికి కూడా పై వాటిలో ఏదో కారణం చూపి రద్దు చేశారు. కావున దయవుంచి విచారణ చేపట్టి వారికి తగు న్యాయం చేయవలసిందిగా మనవి చేసారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, పెన్షన్లు కోల్పోయి దిగులు పడుతున్న భాదితులు, తదితరులు పాల్గొన్నారు.