రామచంద్రపురం జనసేన ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుక

రామచంద్రపురం, సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ పట్టణ యూత్ అధ్యక్షులు మిధిల్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో సోమవారం రామచంద్రపురం పట్టణం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నాగమణి టీచర్, సలాది నాయుడు మాస్టర్, రాఘవరావు మాస్టర్ మరియు చప్పిడి చంద్రన్న కాపు మాస్టర్ ఇంటికి వెళ్లి దుశ్శ్లువాలతో పూలమాలతో సన్మానించడం జరిగింది. వారి యెుక్క ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడో వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాస్ జనసేన నాయకులు నంబుల నాగు, లంక సత్యనారాయణ, అక్కిరెడ్డి శ్రీను, పోలిశెట్టి పెదబాబు, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు ఆరంకోటి అచ్యుతానంద్, సాయి కుమార్, రాంబాబు నాయుడు, మాకినీడి వీరబాబు, విల్లా కార్తీక్, నందికోళ్ళ దుర్గా ప్రసాద్, సెలగల వెంకటేష్, పల్లా నాగేంద్ర తదితర జనసైనికులు ఈ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.