కళ్యాణదుర్గం జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ళు – పేదలకు కన్నీళ్లు

కళ్యాణదుర్గం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలంలో మండల అధ్యక్షుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ళు – పేదలకు కన్నీళ్లు, #ఝగనన్నంఒసం కార్యక్రమాన్ని కదిరిదేవరాపల్లి, తిమ్మాపురం, కంబదూరు టౌన్లో జగనన్న కాలినిని పరిశీలించి అక్కడి పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు ఐదువందలకు పైచిలుకు లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ఇప్పటిదాకా కనీసం ఒక ఇళ్ళు కూడా పూర్తి కాలేదు. ఎంతో అర్బటలతో ప్రారంభించిన జననన్న కాలినీలు సరైన సదుపాయాలు లేక ఆధ్వన్న స్థితిలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లపట్టాలనే ఈ ప్రభుత్వంలో వేరే లబ్దిదారులకిచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు పూర్తి అయినా కనీసం ఒక శాతం ఇళ్ళు కూడా పూర్తి చేయకపోవడం వైసీపీ పాలనకు నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి లబ్ధిదారులకు ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వాలని కంబదూరు జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, వెంకటేష్, నరేష్, గోవింద్, సురేష్, తిప్పేస్వామి, ప్రకాష్, అనిల్, నరేంద్ర, అజయ్, గోపాల్, సూరి, హేమంత్, మునింద్ర పాల్గొన్నారు.