మతసామరస్యానికి మారుపేరు రంజాన్

సత్తెనపల్లి నియోజకవర్గం, నగరికల్ మండలం ఇఫ్తార్ విందు వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు. దేశంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ వేడుకల్లో భాగమైన ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రావెంకట అప్పారావు స్పష్టం చేశారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ మాసం సందర్భంగా బొర్రా ఆధ్వర్యంలో మండల వైస్ ప్రెసిడెంట్ రఫీ నేతృత్వంలో శనివారం నగరికల్ మండలంలో తన ఇంటి నందు ఇఫ్తార్ విందు వేడుక అత్యంత అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా మండలంలోని ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లింల నమాజ్ తో పాటుగా ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో బొర్రా వెంకటప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దల ఆశీర్వచనాలు అందుకున్న బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ నేటి రాక్షస పాలనకు ఆధ్యుడైన జగన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లింలని కాక ప్రజలందరినీ చిన్నచూపు చూస్తూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. ముందు చెడు విజయం సాధించిన ఎప్పటికైనా మంచి ముందుకెల్తుందని త్వరలోనే ప్రజలంతా పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేసి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపటం ఖాయం అన్నారు. అనంతరం ముస్లిం మత పెద్దలందరికీ పౌష్టికాహారం అందజేసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమానికి విచ్చేసిన మండల స్థాయి ముస్లిం నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి తానే స్వయంగా ప్రతి ఒక్కరికి భోజనం అందిస్తూ ముస్లింలపై తనకున్న ప్రేమాభిమానాలను మరోసారి రుజువు చేసుకున్నారు బొర్రా వెంకట అప్పారావు. ఈ కార్యక్రమంలో బొర్రా వెంట జనసేన పార్టీ నాయకులు, మండలాధ్యక్షులు కౌన్సిలర్ మండల కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్షులు జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.