మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ

రాజానగరం: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాజానగరం మండలం లాలాచెరువు హోసింగ్ బోర్డు మసీద్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలతో కలిసి పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన – తెలుగుదేశం – బిజెపి పార్టీల ఉమ్మడి ఎంఎల్ ఏ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, రంజాన్ పర్వదినం సందర్భంగా ముందుగా ముస్లిం సోదరి, సోదరీమణులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమన్నారు. నెలవంక చూసినప్పటినుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి, అల్లా కృపకు పాత్రులవుతారన్నారు. ముస్లిం సోదరులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం – బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.