విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయునికి నివాళులర్పించిన రామశ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, టి.సుండుపల్లి మండలం చేండ్రాజు పల్లికి చెందిన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు సదాశివ రాజు గతనెల 26 న మరణించడం జరిగింది. వారి దశ దిన కర్మకు జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ హాజరై శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించారు. వీరితో పాటు ఆయన పెద్ద కుమారుడు యూఎస్ ఎన్.ఆర్.ఐ, సురపు సురేష్ కుమార్ రాజు, ప్రముఖ జర్నలిస్ట్ రమేస్ కుమార్ రాజు, జనసేన నాయకులు గుంటిమడుగు శ్రీనివాసరాజు, స్థానికులు, గ్రామస్థులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.