పవన్ కళ్యాణ్ ను కలిసిన రాజారెడ్డి

మంగళగిరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిలో పలు అంశాలను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. జనసేన బలోపేత దిశగా పలు సూచనలు చేశారు. నాయకులను, కార్యకర్తలను కలుపుకొని అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవాలని పవన్ సూచించారు.