ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చిన గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె, రాబోయే అసెంబ్లీ‌ ఎన్నికలకు ఇప్పటంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవం నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర శంఖారావం పూరిస్తారని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె టౌన్ కమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి అసమర్థ, అవినీతి పాలనపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చే పిలుపు కోసం జనసైనికులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు, పలమనేరు, కుప్పం, నియోజకవర్గాల నుంచి ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ‌మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హఠావో, దేశ్ కి బచావో అన్న పిలుపుతో కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా పోయిందన్నారు.‌ ఇప్పుడు ఇచ్చే పిలుపు రాష్ట్ర రాజకీయలను మలుపు తిప్పే విధంగా ఉంటాయన్నారు. జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ సినిమా ధరలు తగ్గింపు, పెంచడంలో ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టారు. ‌ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ‌జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాయల దక్షిణ కోస్త పార్లమెంటరీ సమన్వయ కమిటీ సభ్యులు మైఫోర్స్ మహేష్, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివారం రాయల్ మదనపల్లె పట్టణ కమిటీ అధ్యక్షుడు జంగాల శక్తి జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, లీగల్ సెల్ అమరనారాయణ, మండల కమిటి అధ్యక్షుడు గ్రానైట్ బాబు, లక్ష్మీనారాయణ, జగదీష్, ఫాజిల్, సనావుల్లా, టైగర్, రెడ్డెమ్మ, గజ్జల రెడ్డెప్ప, పవన్ కుమార్, లోకేష్, నవీన్ పాల్గొన్నారు.