కొలిమి ప్రసాద్ సతీమణికి నివాళులర్పించిన రామదాస్ చౌదరి

మదనపల్లి, జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు కొలిమి ప్రసాద్ సతీమణి అకాల మరణం చెందడంతో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, ఐటీ విభాగ నాయకులు కల్లూరు లక్ష్మినారాయణ, లవన్న, రూరల్ సెక్రటరీ జనార్దన్, పట్టణ ఉపాధ్యక్షులు కుమార్, ఫాజీల్ తదితరులు పాల్గొన్నారు.