శేరిలింగంపల్లిలో జనసేన డోర్ టు డోర్ జాయిన్ విత్ జె.ఎస్.పి

శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి జనసైనికులు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా హుడా కాలనీ జనసైనికులు నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి వెళ్ళి పార్టీ యొక్క సిద్ధాంతాలను వివరించి మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంల ఉపేంద్ర, నరేష్, కళ్యాణ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.