నిమ్మనపల్లెలో జనసేన జెండా ఆవిష్కరించిన రాందాస్ చౌదరి

మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లి మండలం, నిమ్మనపల్లెలో దిగువ వీధిలో రామాంజులు ఇంటి దగ్గర జనసేన పార్టీ అధినేత రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిమ్మనపల్లిలో అభిమానులు కార్యకర్తలు గంగారపు రాందాస్ చౌదరికి బస్టాండ్ కూడలిలో బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు కష్టాలు తీర్చే నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లె రూరల్ మండల నాయకులు గ్రానైట్ బాబు సీనియర్ నాయకులు తోటకళ్యాణ్, జగదీష్ బాబు, వీర మహిళ రెడ్డమ్మ, నిమ్మనపల్లె కాలు, రామంజులు, మదన్ సింగ్, భరత్ సింగ్, మంజు సింగ్, జనార్ధన తదితరులు పాల్గొన్నారు.