అమోఘ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణం వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్ నందు అమోఘ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేబ్రోలు జనసైనికులు కిర్లంపల్లి దేవుళ్ళు, పెంకే శ్రీనివాసు, గవసాని గంగాధర్, సఖినాలా శివ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, వారి వ్యాపారం దిన దిన అభివృద్ధి జరగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్యప్రకాష్ రావు, పిఠాపురం టౌన్ మహిళా అధ్యక్షురాలు కోలా దుర్గ, పెద్దింటి శివ, బుద్ధాల చంటిబాబు, పెనుగొండ వెంకటేశ్వరరావు, మచ్చ అప్పారావు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.