మలినీడి తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపిన రమేష్ బాబు మారసాని

తిరుపతి, జనసేన పార్టీ మరియు తిరుపతి జిల్లా కాపు సంక్షేమ సేన రైతు విభాగం అధ్యక్షులు రమేష్ బాబు మారసాని జనసేన పార్టీ ప్రోటోకాల్ విభాగానికి చైర్మన్ గా నియమించిన మలినీడి తిరుమలరావు(బాబి)కి శుభాకాంక్షలు తెలిపారు, ఈరోజు జనసేన పార్టీ ప్రోటోకాల్ విభాగానికి చైర్మన్ గా నియమించిన బాబి జనసేన పార్టీకోసం ఎంతో కష్టపడ్డారని, కానీ ఎప్పుడూ బాబి ఫలితం ఆశించలేదు, కానీ ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు ప్రోటోకాల్ విభాగానికి చైర్మెన్ గా నియమించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, మరి కాపు సంక్షేమ శాఖలో కూడా రాష్ట్ర నాయకుడు అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని, బాబి గారు భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు అందుకోవాలని కోరుతున్నామని అన్నారు.