శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో జనసేన నాయకులు

తెలంగాణ, కూకట్పల్లి శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బాలానగర్ లోని శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం, కళ్యాణి నగర్ లో సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమం మరియు అన్న ప్రసాద కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ గడ్డం నాగరాజ కిషోర్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రాజేష్ యడమ, మేడ్చల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ లక్ష్మణ్, కూకట్పల్లి కో-ఆర్డినేటర్లు కొల్ల శంకర్, భోగాది వెంకటేశ్వరరావు, నాగేంద్ర, మహేష్ బాలానగర్ ప్రెసిడెంట్ జనే సునీల్, వైస్ ప్రెసిడెంట్ నరేష్ పాల్గొన్నారు.