రంగంపేట మండల స్థాయి సమావేశం

అనపర్తి నియోజకవర్గం, రంగంపేట మండలంలో జరిగిన మండల సమావేశంలో పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేయాలి, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని జనసేన అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ జనసైనికులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రావాడ నాగు, జిల్లా కమిటీ సభ్యులు చిట్టి బ్రహ్మం, మండల అధ్యక్షులు గిరిజల సత్తిబాబు, ఉపాధ్యక్షుడు గంగాధర్, మండల నాయకులు యానాల కొండయ్య మండల నాయకులు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.