కరెంటు కోతలపై జనసైనికుల ఆందోళన కార్యక్రమం

పార్వతీపురం విద్యుత్ కార్యాలయం వద్ద కరెంటు కోతలపై జనసేన ఆధ్వర్యంలో జనసైనికులు ఆందోళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విసనకర్రలతో విసురుకుంటూ వినూత్న నిరసన తెలిపి. కరెంట్ ఇవ్వడం చేతగాని సీఎం జగన్ గద్దె దిగాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పలూరుతో పాటు నాయకులు చందక అనిల్, చంటి, కరుణ, దాలినాయుడు, రాంబాబు, విశ్వేస్, బాలు, శిరీష్, నాని, చైతన్య, గణేష్,లక్ష్మి, స్వామినాయుడు, గౌరి, ఉపేంద్ర, అప్పలనాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.