సెప్టెంబర్ 10 నుండీ వాయుసేనలో రాఫెల్

ఇక పై భారతీయ వాయు సేనకు మరింత బలం చేకూరనుంది. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 10న అధికారికంగా ప్రారంభించనున్నారు. అంబాలా ఎయిర్ బేస్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే కూడా హాజరుకానున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మొదటి విడతలో భాగంగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి జూలై 29న భారత్ చేరాయి. ఇందులో రెండు సీట్లు కలిగిన శిక్షణ విమానాలు కాగా, మరో మూడు ఒకే సీటు కలిగిన యుద్ధ విమానం. విమానాలు భారత్‌చేరిన మరుసటి రోజు నుంచే వాయుసేన శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. రెండో విడతలో రానున్న ఈ అత్యాధునిక యుద్ధ విమానాలను పశ్చిమబెంగాల్‌లోని హస్మీరా ఎయిర్ బేస్‌లో ఉంచనున్నారు.