ఒంటిమిట్ట సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన రాటాల రామయ్య

ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. పురుషోత్తమ రాజును జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంటిమిట్ట మండల గ్రామాల్లోని పలు సమస్యలను ఆయనకు వివరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.