యువశక్తి గోడపత్రికను ఆవిష్కరించిన రాయపాటి అరుణ

కందుకూరు: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12వ తేది నిర్వహించే భారీ బహిరంగ సభను మనమందరం విజయవంతం చేద్దామని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మరియు కందుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ మల్లికార్జున పిలుపునిచ్చారు. స్థానిక ఉలవపాడు మండలం చాగల్లు గ్రామంలో యువశక్తి భారీ బహిరంగ సభ గోడ పత్రికను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ జనవరి 12వ తేది గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతను మేలు కొల్పేందుకు యువశక్తి పేరుతో నిర్వహించే భారీ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి యువత తమ సమస్యలను తెలుపుకునే అవకాశం రణస్థలం సభలో ఉంటుందని రాయపాటి అరుణ తెలిపారు. అందరం కలిసి యువశక్తి భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు బాలచందర్ నాయుడు, జనసైనికులు కట్ట రాంబాబు, ఓరుగంటి చంద్రశేఖర్, ఖాదర్ బాషా, రాయపాటి సురేంద్ర, అజయ్, వీరమల్లు రోహిత్, సందీప్, అల్తాఫ్, చక్రి, విక్కీ, కుమార్ మొదలైన వారు పాల్గొన్నారు.