జనసైనికులకు క్రికెట్ కిట్ ను అందజేసిన రాయపురెడ్డి

మాడుగుల నియోజకవర్గం: మాడుగుల మండలంలో ఎల్ పొన్నవొలు పంచాయతీ జనసైనికులకు మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపు రెడ్డి కృష్ణ ఒక క్రికెట్ కిట్ ను.. ఎల్. పొన్న వోలు పంచాయతీ కలిమిశెట్టి గణేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలోని యువకులకు రాయపరెడ్డి కృష్ణ గారు క్రికెట్ కిట్లు అందజేయడం చాలా చెప్పుకోదగ్గ విషయమని, పార్టీలో కార్యకర్తలని వాడుకోవడమే కానీ కార్యకర్తలకు కావలసినవి ఇచ్చేవాడే అసలైన నాయకుడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ పోన్నవోలు పంచాయతీ జనసైనికులు పాల్గొన్నారు.