ఈ.ఆర్.ఓ అధ్యక్షతన ఆల్‌ పార్టీ సమావేశానికి హాజరైన జనసేన నాయకులు

కొండపి నియోజకవర్గం: కొండపి మండలం తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈ ఆర్ ఓ) అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలకు కలిపి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నుండి పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండలం అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, టంగుటూరు మండలం అధ్యక్షులు కందుకూరి రాంబాబు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఓటర్ల లిస్టు నందు చనిపోయిన వారు, గ్రామం నుండి వెళ్లిపోయిన వారు, డూప్లికేట్స్ ఓటర్స్, మరియు ఓటర్ పేరు, అడ్రస్సు, ఫోటో సవరణకు పరిశీలన చేయుట మొదలైన అంశాల గురించి చర్చించడం జరిగింది.