జనసైనికుడికి అండగా రాజోలు జనసేన కువైట్ గ్రూపు

మలికిపురం మండలం, కత్తిమండ గ్రామానికి చెందిన జనసైనికుడు కటికిరెడ్డి సాయికి ప్రమాద వశాత్తు కాలికి ఆపరేషన్ జరిగింది. విషయం తెలుసుకొన్న బోనం దుర్గాప్రసాద్ జనసేన కువైట్ గ్రూపు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.. వెంటనే వారు స్పందించి సాయికి మందుల ఖర్చుల నిమిత్తం జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ గ్రూపు సభ్యులు ఎర్రంశెట్టి బాబీ మరియు ఇతర సభ్యులు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించగా.. జనసేన నాయకులు పంచదార చినబాబు, జనసేన వార్డ్ నెంబర్ అడబాల నగేష్, రేకపల్లి నాగరాజు చేతులమీదుగా కటికిరెడ్డి సాయికి అందచెయ్యటం జరిగింది. ఈ సందర్భంగా.. రాజోలు జనసేన తరపున జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ సబ్యులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఇటువంటి సేవా కార్యక్రమలు మరెన్నో చెయ్యాలి అని కోరారు.