కౌలు రైతులను ఆదుకోవడమే జనసేన పార్టీ లక్ష్యం

ఎమ్మిగనూరు: రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా.. ఎమ్మిగనూరు మండలం, కోటేకల్ గ్రామం నందు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, ప్రధాన కార్యదర్శి బజారి లు మాట్లాడుతూ.. కౌలు రైతులను ఆదుకోవడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం అని అందులో భాగంగా జనసేన అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది కౌలు రైతులకు 30 కోట్లు సహాయాన్ని అందించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి అని అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన కౌలు రైతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, కరణం రవి, రమేష్, కోటేకల్ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.