గుర్తింపు ఎన్నికలు జరిపించాలి.. జనసేన డిమాండ్

గడివిడి ఫేకర్ కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపించాలని జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం లేబర్ కమీషనర్ ఆఫీసుకు వెళ్లి డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనందు వలన కార్మికులు పలు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్మికులకు అందాల్సిన సౌకర్యాలు అందడం లేదని, కమిషనర్ ఆఫ్ లేబర్ వారికి జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మగంటి సూరినాయుడు, అడ్డాల రామచంద్ర రాజు, యూనియన్ నాయకులు రాజాన రమణ, ఆదినారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది.