కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి వేగంగా కోలుకున్నారు. సీఎంకు వ్యక్తిగత వైద్యులు ఎంవి రావు పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీ జెన్ పరీక్షలో కరోనా నెగటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ నేడు రానున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

ఏప్రిల్ 14వ తేదీన నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభలో పాల్గొన్న పలువురు నేతలు కరోనా వైరస్ బారిన పడ్డారు. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ నోముల, అంజయ్యలకు కరోనా వైరస్ సోకింది. అనంతరం 19వ తేదీన కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఎం.వి.రావు బృందం పరీక్షలు నిర్వహించింది. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారంచడంతో నేరుగా సీఎం కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. తర్వాత..యశోదా ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సీఎం ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన నెగటివ్ రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.