పోలవరం స్పిల్‌వే మీదుగా నీరు విడుదల

పోలవరం ప్రాజెక్టు నుంచి డెల్టాకు స్పిల్‌వే మీదుగా గోదావరి నీటిని విడుదల చేశారు. గోదావరిలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కావడంతో స్పిల్‌వే మీదుగా నీటిని మళ్లించారు. గోదావరిలో అప్రోచ్‌ కెనాల్‌కు నీరు విడుదల చేయడంతో స్పిల్‌వే, రివర్‌ స్లూయిజ్‌ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి.. అక్కడి నుంచి సెంట్రల్‌ డెల్టా, తూర్పు, పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టాకు చేరనుంది. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, ఇఎన్‌సి నారాయణ రెడ్డి, మేఘా ఇంజినీరింగ్‌ ప్రతినిధులు హాజరుకాగా.. మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని వర్చువల్‌గా పాల్గొన్నారు.