జనసేన ఆధ్వర్యంలో కంపచెట్లు తొలగింపు

  • జనసేన ఉదయగిరి నియోజకవర్గ నాయకులు బోగినేని కాశీ రావు ఆధ్వర్యంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న కంపచెట్లు తొలగింపు

ఉదయగిరి నియోజకవర్గం: సీతారామపురం మండల పరిధిలోని మారంరెడ్డిపల్లి కాలనీ నుండి సీతారామపురం వెళ్లే మార్గంలో రోడ్డు కనపడకుండా కంప చెట్లు పెరగడం వలన తరచూ వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని గ్రామ ప్రజలు పంచాయితీ దృష్టికి తీసుకెళ్లగా వారు పంచాయతీ నిధులు లేవని పని చేయించలేమనేసి చెప్పడంతో ఈ విషయాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు భోగినేని కాశీరావు దృష్టికి జనసేన నాయకులు తీసుకురావడంతో కాశీరావు స్పందిస్తూ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి కొంప చెట్లను సుమారు 8 గంటల పాటు జేసీబీని ఏర్పాటు చేసి పూర్తిగా తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసి గ్రామ ప్రజలు, వాహనదారులు ప్రభుత్వం చేయలేని పనిని జనసేన పార్టీ ధ్వారా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు (కేర్ టెకర్) బోగినేని కాశీరావు, జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర, జనసేన నాయకులు శ్రీనివాసులు, లక్ష్మణ్, జనసైనికులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.