కొవిడ్ చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు
కొవిడ్ రోగులకు అందించే చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తూ ఐసీఎంఆర్ సోమవారం రాత్రి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దానివల్ల ఎలాంటి ఫలితం లేదని వివిధ అధ్యయనాల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రెమ్డెసివిర్, టొసిలిజుమ్యాబ్లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది. ఎయిమ్స్/ఐసీఎంఆర్ కొవిడ్-19 నేషనల్ టాస్క్ఫోర్స్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్లో తీసుకున్న నిర్ణయంలో భాగంగా సవరించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది.