దొంగ ఓట్లను తొలగించండి!

తిరుపతిలో విచ్చలవిడిగా నమోదవుతున్న దొంగ ఓట్ల ప్రక్రియను ఖండిస్తూ.. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి నాయకులు జిల్లా అడిషనల్ ఎస్ పికి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కి తిరుపతిలో అక్రమంగా 40,000 దొంగ ఓట్లను తొలగించమని వినతి పత్రం అందచేసిన జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గ కిరణ్ రాయల్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జనసేన నుంచి జేఎంసీ శివ, జిల్లా కార్యదర్శి ఆనంద్, బాటసారి, బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాసులు, అజయ్ కుమార్ జనసేన నాయకులు, నగర కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, రుద్ర కిషోర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.