కాకినాడ సిటీ జనసేన కార్యలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • మాజీ నేవీ, ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులతో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కాకినాడ సిటీ: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ ఆలోచనలతో కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో విశ్రాంత త్రివిధ దళాల ఉద్యోగులు ఎస్ శ్రీనగేష్ బి. రవికుమార్ మరియు ఎస్.రామారావుల చేతులమీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం త్రివిధ దళాల మాజీ ఉద్యోగులకు మరియు విద్యా రంగంలోని ఉపాధ్యాయులకు చిరు సత్కారం చేసి గౌరవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ సహాయ కార్యదర్సులు శ్రీమతి మిరియాల హైమవతి, శ్రీ.కటారి శ్రీను, డివిజన్ అధ్యక్షులు మనోహర్ లాల్, తల్లిబొయిన సత్యనారాయణ(శ్రీను), వాసిరెడ్డి సత్య కుమార్, అడబాల రాజేంద్ర ప్రసాద్, సుంకర రామకృష్ణ, డివిజన్ ఉపాధ్యక్షులు చికట్ల శ్రీనివాసు, వాసిరెడ్డి సుబ్బారావు, ఎం.టి బ్రమ్మాజీ, కార్యదర్శులు సాధనాల రమేష్, మిరియాల చినబాబు, నాయకులు దేవిశెట్టి రాజు, తాతబ్బాయి, దుర్గా ప్రసాద్, ధనాద్రి శ్రీను, గుర్రాల జానుబాబు, కార్యకర్తలు వీరమహిళలు పాల్గొన్నారు.