ఉమ్మడి కరీంనగర్ జనసేన ఆధ్వర్యంలో ‘నా సేన కోసం.. నా వంతు’ జూమ్ సమావేశం

ఉమ్మడి కరీంనగర్, జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం నిర్వహిస్తున్న ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు అయ్యి పార్టీకి తమవంతు సహాయ సహకారాలు అందించాలి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముందుకు తీసుకువెళ్లడానికై, ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు జనసేన పార్టీ జిల్లా నాయకులతో ఉమ్మడి కరీంనగర్ యువజన అధ్యక్షులు, నా సేన కోసం నా వంతు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల మధు ఆధ్వర్యంలో జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర యువజన కార్యదర్శి మూల హరీష్ గౌడ్ పాల్గొన్నారు. నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఎలా తీసుకునివెళ్లాలో ఒక ప్రణాళిక రూపొందించి, అదే విధంగా రాష్ట్రం మొత్తం ఉమ్మడి కరీంనగర్ వైపు చూసేటట్టుగా ఒక పెద్ద కార్యక్రమానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు, నియోజకవర్గం నాయకులు, ఇన్చార్జులు, యువజన విభాగం నాయకులు, జనసేన పార్టీ ఇతర కమిటీ ముఖ్య నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.