సత్తెనపల్లి జనసేన ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సత్తెనపల్లి నియోజకవర్గం: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను సత్తెనపల్లి నియోజకవర్గ రాజుపాలెం నకరికల్లు మండలాల ఉపాధ్యక్షులు జండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి, అంచుల అనీష్ కుమార్, నగరికల్లు మండల ఉపాధ్యక్షులు బత్తిన శ్రీనివాసరావు, పట్టణ నాయకులు రాడ్లు శ్రీనివాసరావు, నియోజకవర్గ కార్యాలయం ఇన్చార్జి సిరిగిరి మణికంఠ, దమ్మాలపాడు గ్రామ అధ్యక్షుడు శివయ్య, మెల్లగు వెంకటేష్, తిరుమల శెట్టి సాంబశివరావు, చిరతన రామాంజనేయులు, అవులా నాగరాజు, పసుపులేటి సాంబశివరావు, షేక్ కాజా తదితరులు పాల్గొన్నారు.