ఉప్పల్ జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

ఉప్పల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వీర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నీహారిక నాయుడు ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీరమహిళా విభాగం కార్యనిర్వహక సభ్యురాలు వెంకట లక్ష్మి, ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ రావు, జే.ఎస్. భరత్, కార్యనిర్వహణ సభ్యులు రామాంజనేయులు, చర్లపల్లి డివిజన్ ఉపాధ్యక్షుడు దేవేందర్, ప్రధాన కార్యదర్శి సూర్య తోరం పాల్గొని విజయవంతం చేశారు.