ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

ఖమ్మం, 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మెడబోయిన కార్తీక్, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులు యాసంనేని అజయ్ కృష్ణ, యువజన విభాగం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ మరియు విద్యార్థి విభాగం కమిటీ కన్వీనర్ గంజి ఉదయ్, ఖమ్మం నగర కమిటీ కార్యదర్శి బోడ వినోద్, మాలిక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.