కాకినాడ జనసేన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

కాకినాడ గోడారి గుంట జనసేన పార్టీ కార్యాలయం వద్ద 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు విద్యార్థులతో కలిసి జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జండాను ఆవిష్కరణ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపి, స్వీట్స్ పంచిపెట్టారు.