జనసేన పార్టీలో చేరిన తాడేపల్లివాసులు

మంగళగిరి నియోజకవర్గం: తాడేపల్లి పట్టణం, ప్రకాష్ నగర్ కి చెందిన పలువురు జనసేనాని మీద అభిమానంతో పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలకి ఆకర్షితులై పార్టీలో చేరదామని పార్టీ నాయకులను సంప్రదించటంతో ఆదివారం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనసేనాని మీద అభిమానంతో పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలకి ఆకర్షితులై పార్టీలో చేరటం జరిగిందని అన్నారు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను అరికట్టాలంటే, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుందని రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి పవన్ కళ్యాణ్ గారిని రానున్న ఎన్నికల్లో సీఎం అయ్యే విధంగా, అలాగే నియోజవర్గంలో పార్టీ గెలుపు కోసం మనందరం కలిసికట్టుగా పని చేయాలని కోరారు. మన అందరిదీ ఒకటే నినాదం.. జగన్ పోవాలి పవన్ రావాలి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారాలి #HELLO_AP_BYE_BYE_YCP – #WELCOME_JSP హలో ఏపీ.. బై బై వైసీపీ.. వెల్కమ్ జేఎస్పీ.. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజు, కళ్యాణ్, కోటి, దుర్గారావు, ప్రశాంత్ బాబు, మనోజ్, గోపి, రాజ్ కుమార్, నాగరాజు, సాయి, షేక్ షాకిల్, సజ్జు, శ్రీనివాసరావు, రాజేష్, మహేంద్ర, వెంకట సాయి కుమార్, షేక్ ఫైజాన్, పవన్, ప్రవీణ్ కుమార్, సుధీర్ తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, మంగళగిరి నియోజకవర్గం కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు – మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తిరుమలశెట్టి కొండలరావు, ఎంటిఎంసీ కార్యదర్శి బళ్ళ ఉమామహేశ్వర రావు, మంగళగిరి నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, ప్రకాష్ నగర్ జనసైనికులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.