బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గురువులకు ఘన సత్కారం

రాజోలు నియోజకవర్గం: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వించ దగ్గదని రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు కొనియాడారు. సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, స్థానిక సర్పంచ్ విశా తాతయ్య నాయుడు, జనసేన నాయకులు లింగోలు మహాలక్ష్మి ఎల్ ఐ సి, కందులపాటి ఆంజనేయులు, బీజేపీ నాయకులు మాలే శ్రీనివాస్ నగేష్, నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.