కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్ల హామీ ఇంకా అమలు కాలేదని తప్పుబట్టారు. 60 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు హామీ రెండేళ్లయినా అతిగతీ లేదని మండిపడ్డారు. గత రెండేళ్లుగా లక్షలాది మంది అర్హులు పెన్షన్‌కు దూరమయ్యారని, పెన్షన్లకు అర్హులైన వారిని గుర్తించేందుకు ఎన్యూమరేషన్ చేయించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.